Telugu Global
Telangana

తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు.. ఆదివాసీల 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపు

ఆదివాసీల తరపున అడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. తాజాగా చీఫ్ జస్టీస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.

తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు.. ఆదివాసీల 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపు
X

తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు.. ఆదివాసీల 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపు

తెలంగాణలోని ఆదివాసీలు 75 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి రాష్ట్ర హైకోర్టు ముగింపు పలికింది. సుదీర్ఘకాలంగా చేస్తున్న న్యాయ పోరాటానికి ఇవాళ ఫలితం దక్కింది. తమ ప్రాంతం కోసం అలుపెరుగకుండా పోరాడిన ఆదివాసీలు.. చివరకు అనుకున్నది సాధించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కిందకు వస్తాయని తెలంగాణ హైకోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 23 గ్రామాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి రావని కొంత మంది ఆదివాసియేతర నాయకులు కోర్టును ఆశ్రయించారు. అవి మైదాన ప్రాంతపు గ్రామాలని వాదించారు.కానీ, ఆ గ్రామాలు ఆదివాసీలవే అని.. ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నా.. బయటి నుంచి వచ్చిన కొంత మంది ఆధిపత్యం చెలాయిస్తున్నారంటూ ఆదివాసీలు పేర్కొన్నారు. ఆ 23 గ్రామాలను రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 కిందనే ఉంచాలంటూ ఆదివాసీలు హైకోర్టును ఆశ్రయించారు.

కొంత కాలంగా ఆ పిటిషన్‌పై ఆదివాసీల తరపున అడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. తాజాగా చీఫ్ జస్టీస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. వాదోపవాదనలు విన్న తర్వాత సదరు 23 గ్రామాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 23 కిందకు వస్తాయని తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మసనం స్పష్టం చేసింది. తమకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ల తమ పోరాటానికి ఫలితం దక్కిందని వారు సంబర పడుతున్నారు.

First Published:  5 July 2023 6:33 AM GMT
Next Story