Telugu Global
Telangana

సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు.. దానం ప్లేసులో మహిళకు ఛాన్స్‌.!

దానం ప్లేసులో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహిళను బరిలోకి దించుతారని తెలుస్తోంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం.

సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు.. దానం ప్లేసులో మహిళకు ఛాన్స్‌.!
X

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన దానంకు కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది.

తాజాగా దానం ప్లేసులో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహిళను బరిలోకి దించుతారని తెలుస్తోంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌ గూటికి చేరిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ టికెట్ హామీతోనే ఆయన హస్తం గూటికి చేరారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయనను పక్కనపెట్టిన కాంగ్రెస్‌ దానంకు టికెట్ ఇచ్చింది. అయితే ఎంపీగా పోటీకి దానం పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో బొంతు శ్రీదేవి పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. బొంతు శ్రీదేవి ప్రస్తుతం చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు.

First Published:  21 April 2024 7:43 AM GMT
Next Story