Telugu Global
Telangana

నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తోనే..

తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీఆర్ఎస్ లోనే, కేసీఆర్ తోనే ఉంటానన్నారు కౌశిక్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ సభ్యులతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.

నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తోనే..
X

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఫేక్ న్యూస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్న మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తోనే, కేసీఆర్ కుటుంబంతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారంలో ఉన్న వార్తల్ని ఆయన ఖండించారు.


ఎందుకీ పుకార్లు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇలాంటి ప్రచారమే జరిగింది. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్తున్నారంటూ కొంతమంది వార్తలిచ్చారు. అప్పట్లో అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. అయితే తాజాగా మళ్లీ ఇలాంటి ప్రచారమే మొదలు పెట్టారు. ఈసారి కౌశిక్ రెడ్డితోపాటు గంగుల కమలాకర్ కూడా పార్టీ మారుతున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అవి ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు.

తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీఆర్ఎస్ లోనే, కేసీఆర్ తోనే ఉంటానన్నారు కౌశిక్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ సభ్యులతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. మీడియా నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయాలని సూచంచారు. తప్పుడు వార్తలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి.

First Published:  26 March 2024 8:47 AM GMT
Next Story