Telugu Global
Telangana

శ్రీరామనవమి రోజు భద్రాద్రి రామయ్య కల్యాణం.. దగ్గరుండి చూడాలనుకుంటున్నారా..!

కల్యాణం రోజు వెళ్లడం వీలుకాని భక్తులు 5 వేలు, 116 రూపాయల టికెట్లతో పరోక్ష పద్ధతిలో గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. ఈ టికెట్లు కూడా వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

శ్రీరామనవమి రోజు భద్రాద్రి రామయ్య కల్యాణం.. దగ్గరుండి చూడాలనుకుంటున్నారా..!
X

శ్రీరామనవమి రోజున భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని దగ్గరుండి చూడాలని చాలామంది భక్తులు కోరుకుంటారు. అలాంటి వారికోసం భద్రాద్రి దేవస్థానం ఏటా ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని పురస్కరించుకుని కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించాలనుకునే భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచింది దేవస్థానం.

శ్రీరామ నవమి రోజున ఉభయ దాతల టికెట్ రుసుమును 7వేల 500గా నిర్ణయించారు. ఈ టికెట్ ద్వారా ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. అలాగే 2వేల 500, 2వేలు, వెయ్యి, 300, 150 రూపాయల టికెట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లపై ఒక్కరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. 18న పట్టాభిషేకం కోసం 1500, 500, 100 రూపాయల టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. వీటిని https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

కల్యాణం రోజు వెళ్లడం వీలుకాని భక్తులు 5 వేలు, 116 రూపాయల టికెట్లతో పరోక్ష పద్ధతిలో గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. ఈ టికెట్లు కూడా వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి 17 వరకు ఉదయం ఆరు గంటల నుంచి భద్రాద్రిలోని రామాలయ కార్యాలయంలో ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా టికెట్లు కొనుక్కోవాలంటే ఏప్రిల్ 1 నుంచి భద్రాచలం రామాలయం, తానీషా కల్యాణ మండపం, గోదావరి బ్రిడ్జ్ సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది.

First Published:  29 March 2024 8:11 AM GMT
Next Story