Telugu Global
Telangana

ఢిల్లీ పార్టీ వాళ్లు దేశ ముదుర్లు.. వారితో జాగ్రత్త

అన్నా, అక్కా, బావా, చెల్లీ.. అంటూ వరసలు కలిపి మరీ మాయ మాటలు చెబుతారని, ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోతారని... వారిని కలవాలంటే మనమే ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు కేటీఆర్. తెలంగాణపై కేసీఆర్ కి ఉన్న ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్లకి ఎందుకు ఉంటుందన్నారు.

ఢిల్లీ పార్టీ వాళ్లు దేశ ముదుర్లు.. వారితో జాగ్రత్త
X

ఢిల్లీ పార్టీ వాళ్లు దేశ ముదుర్లు, వారితో జాగ్రత్త అని దేవరకొండ ప్రజల్ని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. ఎన్నికల టైమ్ రాగానే వాళ్లు ఎక్కడలేని ప్రేమ చూపిస్తూ ప్రజల దగ్గరకు వస్తారని, మీద పడిపోతారని, కౌగిలించుకుంటారని, అన్నా, అక్కా, బావా, చెల్లీ.. అంటూ వరసలు కలిపి మరీ మాయ మాటలు చెబుతారని, ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోతారని... వారిని కలవాలంటే మనమే ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణపై కేసీఆర్ కి ఉన్న ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్లకి ఎందుకు ఉంటుందన్నారు కేటీఆర్. దేవరకొండలో రోడ్ షో లో పాల్గొన్న ఆయన రవీంద్ర కుమార్ ని మరోసారి గెలిపించుకోవాలన్నారు.


దేవరకొండ మున్సిపాల్టీలో రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు కేటీఆర్. వందల కోట్లతో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ కు 11సార్లు ఛాన్స్‌ లు ఇస్తే ఎం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ను ఎలాగైనా కట్టడి చేయాలని ఢిల్లీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడోసారి గెలిచి, ఢిల్లీలో కూడా కేసీఆర్ గులాబీ జెండా ఎగరేస్తారని ఢిల్లీ పెద్దలకు భయం పట్టుకుందన్నారు. సింహం సింగిల్‌ గానే వస్తుందని, కేసీఆర్ సింహం లాంటి వారని చెప్పారు కేటీఆర్.

రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ అని, రైతు బీమా ఇచ్చింది కూడా ఆయనేనని, దళితబంధు, బీసీ బంధు.. ఇలా అన్ని పథకాలు ఇచ్చింది కేసీఆర్ ఒక్కరేనని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ రూ.5 వేలకు పెంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్‌ ను రూ.400కే ఇస్తామన్నారు. రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు సన్నబియ్యం ఇస్తామని, అసైన్డ్ భూములకు మొత్తం హక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు కేటీఆర్.

First Published:  23 Nov 2023 2:48 PM GMT
Next Story