Telugu Global
Telangana

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం... పరారీలో హీరో నవదీప్‌

ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి వారి సెల్‌ఫోన్లు సీజ్ చేశామన్నారు. మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు సీపీ సీవీ ఆనంద్‌.

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం... పరారీలో హీరో నవదీప్‌
X

మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అనూహ్యంగా హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం నవదీప్‌ పరారీలో ఉన్నాడని చెప్పారు సీపీ సీవీ ఆనంద్‌. హీరో నవదీప్ స్నేహితుడు రాంచంద్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాంచంద్ ద్వారానే నవదీప్ డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు సీపీ స్పష్టం చేశారు. షాడో ప్రొడ్యూసర్ రవి ఉప్పలపాటి కూడా పరారీలో ఉన్నాడని తెలిపారు. ఇక డ్రగ్స్ కేసులో నవదీప్‌ పేరు వినిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు.

మదాపూర్‌లో నార్కోటిక్ విభాగం అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు సీపీ సీవీ ఆనంద్. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి వారి సెల్‌ఫోన్లు సీజ్ చేశామన్నారు. మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు సీపీ. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారిలో వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారన్న సమాచారం ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని...ఈ కేసులో మాజీ ఎంపీ విఠల్‌రావు కుమారుడు దేవరకొండ సురేష్ రావును అరెస్ట్ చేశామన్నారు సీపీ.

ఇక బేబీ సినిమాపైనా సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా చిత్రీకరణ చేయడం సరికాదన్నారు. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇక పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయన్నారు సీపీ.

అయితే ట్విట్టర్‌లో హీరో నవదీప్ స్పందించారు. అది నేను కాదు జెంటల్మెన్.. నేను ఇక్కడే ఉన్నానని.. ముందు క్లారిటీ తెచ్చుకోండి థ్యాంక్స్ అటూ పోస్ట్ పెట్టారు.


First Published:  14 Sep 2023 4:44 PM GMT
Next Story