Telugu Global
Telangana

ముగిసిన ఆపరేషన్.. వైద్యులు ఏమన్నారంటే..?

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా ఆస్పత్రికి వచ్చి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయనకు అందించిన వైద్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ముగిసిన ఆపరేషన్.. వైద్యులు ఏమన్నారంటే..?
X

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ పూర్తయింది. దాదాపు 4 గంటల సేపు ఈ ఆపరేషన్ చేశారు వైద్యులు. లోపల రక్తం పేరుకుపోవడం, చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యమైందని వివరించారు యశోద ఆస్పత్రి వైద్యులు. హైదరాబాద్ కి తరలించడం ఆలస్యం అయి ఉంటే మరింత ఇబ్బంది అయ్యేదని చెప్పారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.


అసలేమైంది..?

కత్తిపోటుతో కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో తీవ్ర గాయమైంది. చిన్నప్రేగుకి కత్తి తగలడంతో దాదాపు 4చోట్ల గాయాలయ్యాయి. దీంతో రక్తస్రావం అయింది. ఆ రక్తం అంతా కడుపులో పేరుకుపోయింది. దాన్ని జాగ్రత్తగా తొలగించి, ఇన్ఫెక్ష్ కాకుండా కాపాడారు వైద్యులు. ఇక చిన్నప్రేగును కూడా 10సెంటీమిటర్ల మేర తొలగించాల్సి వచ్చింది. 4చోట్ల గాయాలు కావడం, దానికి కుట్లు వేయడం సాధ్యం కాకపోవడంతో.. పేగుని 10 సెంటీమీటర్ల మేర తొలగించామని చెప్పారు. కడుపుని 15 సెంటీమీటర్ల మేర కట్ చేసి.. లోపల ఉండిపోయిన రక్తాన్ని శుభ్రపరిచారు. చిన్నప్రేగుని కట్ చేసి తిరిగి కుట్లు వేశారు.


కేసీఆర్, కేటీఆర్ పరామర్శ..

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా ఆస్పత్రికి వచ్చి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయనకు అందించిన వైద్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు.



First Published:  30 Oct 2023 4:03 PM GMT
Next Story