Telugu Global
Telangana

ఇండియ‌న్ ఆర్మీకి హైద‌రాబాదీ మిస్సైల్స్‌.. గ‌ర్వంగా ఉంది : కేటీఆర్ ట్వీట్

హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న క‌ళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్‌(కేఆర్ఏఎస్) సంస్థ‌.. భార‌త్ లో తొలిసారి క్షిప‌ణుల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న ప్రైవేటు సంస్థ‌. ఇది భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల‌కు మిస్సైళ్ల‌ను అంద‌చేస్తున్న‌ది. సుమారు వంద మిస్సైల్ కిట్స్‌ను ఇండియన్ ఆర్మీకి క‌ళ్యాణి సంస్థ ఇస్తున్న‌ది.

ఇండియ‌న్ ఆర్మీకి హైద‌రాబాదీ మిస్సైల్స్‌.. గ‌ర్వంగా ఉంది : కేటీఆర్ ట్వీట్
X

తెలంగాణ‌కు చెందిన క‌ళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్‌(కేఆర్ఏఎస్) సంస్థ ఇండియ‌న్ ఆర్మీకి మిస్సైల్ కిట్స్ అందించ‌డం గ‌ర్వంగా ఉంద‌ని పుర‌పాల‌క‌, ఐటి శాఖ‌ల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేస్తూ ర‌క్ష‌ణ రంగంలో హైద‌రాబాద్ త‌న స్థానాన్ని మ‌రింత సుస్థిరం చేసుకుంటున్న‌ద‌ని పేర్కొన్నారు. బాబా కళ్యాణి జీకి ధ‌న్య‌వాదాలు అంటూ మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న క‌ళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్‌(కేఆర్ఏఎస్) సంస్థ‌.. భార‌త్ లో తొలిసారి క్షిప‌ణుల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న ప్రైవేటు సంస్థ‌. ఇది భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల‌కు మిస్సైళ్ల‌ను అంద‌చేస్తున్న‌ది. సుమారు వంద మిస్సైల్ కిట్స్‌ను ఇండియన్ ఆర్మీకి క‌ళ్యాణి సంస్థ ఇస్తున్న‌ది.

ఇజ్రాయిల్ కంపెనీ భాగ‌స్వామ్యంతో క‌ళ్యాణి సంస్థ హైద‌రాబాద్‌లో మిస్సైల్ కిట్ల‌ను త‌యారు చేస్తున్న‌ది. మ‌ధ్య‌శ్రేణికి చెందిన స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్ల‌ను ముప్ప‌య్ శాతం మేర‌కు డీఆర్డీవో అభివృద్ధి చేసింది. మిస్సైల్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌ను కూడా డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండ‌స్ట్రీస్ సంస్థ ఈ మిస్సైల్ సిస్ట‌మ్‌కు చెందిన 70 శాతాన్ని డెవ‌ల‌ప్ చేసింది. రానున్న నాలుగేళ్ల‌లో వెయ్యి మిస్సైల్ కిట్స్‌ను ఆర్మీకి అందించ‌నున్న‌ట్లు క‌ళ్యాణి గ్రూపు చీఫ్ బాబా క‌ళ్యాణి తెలిపారు. భార‌త ఆర్మీ, నేవీ, వైమానిక ద‌ళాలు ఈ క్షిప‌ణుల‌ను వాడ‌నున్నాయి.

First Published:  14 Dec 2022 10:24 AM GMT
Next Story