Telugu Global
Telangana

గద్దర్ పేరిట అవార్డులు.. నా మాటే శాసనం

తెలంగాణలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్ పేరిట అవార్డు ఇచ్చి గౌరవించుకుంటామన్నారు. నా మాటే జీవో, శాసనమని ప్రకటించారు రేవంత్ రెడ్డి

గద్దర్ పేరిట అవార్డులు.. నా మాటే శాసనం
X

సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.

ఇటీవల సినీ ప్రముఖులు కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారితో చెప్పానన్నారు రేవంత్. నంది అవార్డు స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని సినీ ప్రముఖులకు చెప్పానన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్ పేరిట అవార్డు ఇచ్చి గౌరవించుకుంటామన్నారు. నా మాటే జీవో, శాసనమని ప్రకటించారు రేవంత్ రెడ్డి.


గద్దర్‌కు అనేక రాష్ట్రాల్లో పేరుందని.. ఆయనను శాశ్వతంగా గుర్తు పెట్టుకోవాలంటే గద్దర్ పేరిట పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే సంవత్సరం నుంచి జనవరి 31న గద్దర్ జయంతి రోజే ఏటా పురస్కారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు రేవంత్.

First Published:  31 Jan 2024 4:08 PM GMT
Next Story