Telugu Global
Telangana

మునుగోడు టీఆరెస్ సభకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

మునుగోడులో ఇవ్వాళ్ళ జరగనున్న టీఆరెస్ బహిరంగ సభకు సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆరెస్ కు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది.

మునుగోడు టీఆరెస్ సభకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
X

మునుగోడు లో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరు కావాలని సీపీఐ నిర్ణయించింది. ఈ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆరెస్ తో కలిసి వెళ్లాలని పార్టీ నిర్ణయించుకోవడమేగాక .. తమ మద్దతును ప్రకటించి.. సస్పెన్స్ కి తెర దించింది. శనివారం సీఎం కేసీఆర్ వెంట సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కూడా మునుగోడు వెళ్లనున్నారు. ఈ ఎన్నికలో తమ పార్టీ ప్రచార కార్య్రక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్.. సీపీఐ నేతలను కోరినట్టు తెలుస్తోంది. ఇక్కడ గెలుపు ఓటములను నిర్ణయించేది తామేనని, బీజేపీని ఓడించాలన్నదే తమ ధ్యేయమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఇదివరకే ప్రకటించారు. నిన్న మొన్నటివరకు ఈ పార్టీ మద్దతుకోసం టీఆరెస్ అన్ని ప్రయత్నాలు చేసింది. మంత్రి జగదీష్ రెడ్డి ఇందుకు ఈ పార్టీ నేతలతో జరిపిన చర్చలు ఫలించాయి. తెలంగాణాలో ఏ ఎన్నికలు జరిగినా టీఆరెస్ కి తమ సపోర్ట్ ఉంటుందని సీపీఐ స్పష్టం చేసింది కూడా.. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగానే ఉండడంతో.. సహజంగానే అధికార పార్టీ.. లెఫ్ట్ పార్టీల మద్దతును కోరవచ్చునని వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి.

ఈ నియోజకవర్గంలో 1985-2014 మధ్య జరిగిన ఆరు సార్వత్రిక ఎన్నికలకు గాను 5 ఎన్నికల్లో సీపీఐ విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ ఈ పార్టీ ఓటు బ్యాంకు తగ్గినప్పటికీ.. పల్లావెంకటరెడ్డి వంటి నేతల పలుకుబడి ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం.. మునుగోడు ఎన్నికలో తమ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి గానీ, బీజేపీకి గానీ ఓటు వేయరని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడే సూచనప్రాయంగా ఈ పార్టీ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ ప్రగతి భవన్ లో శుక్రవారం రాత్రి కేసీఆర్, సీపీఐ నేతల మధ్య సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన చర్చలు ..క్లైమాక్స్ కి ముగింపు పలికాయి.




First Published:  20 Aug 2022 4:55 AM GMT
Next Story