Telugu Global
Telangana

ప్రచారంలోనే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. ఆ సీనియర్‌ లీడర్‌కు తీవ్ర గాయాలు

ముఖ్య నేతలతోపాటు సీనియర్‌ నేత బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన తమ్ముడు బండ్ల రాజశేఖర్‌రెడ్డి ప్రచార రథంపైకి ఎక్కేందుకు ప్ర‌య‌త్నించారు.

ప్రచారంలోనే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. ఆ సీనియర్‌ లీడర్‌కు తీవ్ర గాయాలు
X

గద్వాల కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. మల్దకల్‌ మండల కేంద్రంలో లోక్‌స‌భ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు సరిత, సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

అసలేం జరిగిందంటే..

ముఖ్య నేతలతోపాటు సీనియర్‌ నేత బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన తమ్ముడు బండ్ల రాజశేఖర్‌రెడ్డి ప్రచార రథంపైకి ఎక్కేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే మండలంలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రామకృష్ణ మా మండలంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఇతర మండలాలకు చెందిన నాయకులు ప్రచార రథంపైకి ఎక్కొద్దని చంద్రశేఖర్‌రెడ్డి, అతడి తమ్ముడిని అడ్డుకున్నాడు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. రామకృష్ణ వర్గీయులు చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేశారు. తీవ్ర గాయాలవడంతో ఆయన్ని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

First Published:  17 April 2024 1:49 PM GMT
Next Story