Telugu Global
Telangana

సెటిలర్ల ఓట్ల కోసం చంద్రబాబు జపం చేస్తున్న కాంగ్రెస్ నేత

సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న మధుయాష్కీ.. ఇప్పుడు సెటిలర్ల ఓట్ల కోసం చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. సెటిలర్ల ఓట్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.

సెటిలర్ల ఓట్ల కోసం చంద్రబాబు జపం చేస్తున్న కాంగ్రెస్ నేత
X

హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లు అన్ని పార్టీల మధ్య చీలి ఉన్నాయి. అవన్నీ గుంపగుత్తగా ఒకే పార్టీకి పడతాయనే నమ్మకం ఎవరికీ లేదు. అయితే ఆ ఓట్ల కోసం అప్పుడప్పుడు కొన్ని జిమ్మిక్కులు చేస్తుంటారు అభ్యర్థులు. తెలంగాణ ఎన్నికల వేళ, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఇలాంటి ఊరడింపు వ్యాఖ్యలతో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ వార్తల్లోకెక్కారు. చంద్రబాబు అరెస్ట్ వెనక కేసీఆర్, మోదీ ఉన్నారని ఆరోపించారు. కావాలని ఓ వ్యూహం ప్రకారమే వారిద్దరూ చంద్రబాబుని అరెస్ట్ చేయించారన్నారు. జగన్ వీరికి సన్నిహితుడు కావడంతోనే ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టారని సానుభూతి చూపించారు.

సెటిలర్ల ఓట్లకోసమే..

మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యలు కేవలం సెటిలర్ల మద్దతు కోసమే అనే విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇటీవల సెటిలర్ల నిరసనకు మద్దతు తెలిపారని, వారిని బుజ్జగించాలని చూస్తున్నారని కూడా మధుయాష్కీ ఆరోపించడం విశేషం. అదే సెటిలర్ల ఓట్ల కోసం ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడుతున్నారు.

టికెట్ ఎవరికో..?

కాంగ్రెస్ టికెట్ కోసం మధుయాష్కీ అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ స్థానిక నాయకులు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజామాబాద్ నుంచి మధుయాష్కీ ఎల్బీనగర్ ఎందుకొస్తున్నారని ఏకంగా గాంధీ భవన్ లోనే పోస్టర్లు వేశారు. సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న మధుయాష్కీ.. ఇప్పుడు సెటిలర్ల ఓట్ల కోసం చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. సెటిలర్ల ఓట్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.


First Published:  19 Sep 2023 12:22 PM GMT
Next Story