Telugu Global
Telangana

ఆ ఒక్క సీటే పెండింగ్‌.. 16 మంది బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులు వీళ్లే

రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌ పార్లమెంట్‌కు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

ఆ ఒక్క సీటే పెండింగ్‌.. 16 మంది బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులు వీళ్లే
X

బీఆర్ఎస్‌ శనివారం మరో 3 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్‌.. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి.. భువనగిరి నుంచి క్యామా మల్లేశ్‌ పేర్లను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌ పార్లమెంట్‌కు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. నాగర్‌కర్నూల్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ నుంచి వెంకట్రామిరెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి వినోద్ కుమార్, పెద్దప‌ల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జ‌హీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖ‌మ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మ‌హ‌బూబాబాద్ నుంచి మాలోత్ క‌విత‌, మ‌ల్కాజ్‌గిరి నుంచి రాగిడి ల‌క్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం స‌క్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవ‌ర్ధన్, వ‌రంగ‌ల్ నుంచి క‌డియం కావ్య బరిలో ఉన్నారు.

బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులు వీళ్లే:

1. నాగర్‌కర్నూల్‌(ఎస్సీ)- ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

2. పెద్దప‌ల్లి(ఎస్సీ)- కొప్పుల ఈశ్వర్

3. వ‌రంగ‌ల్(ఎస్సీ)- క‌డియం కావ్య

4. మ‌హ‌బూబాబాద్(ఎస్టీ) - మాలోత్ క‌విత‌

5. ఆదిలాబాద్(ఎస్టీ)- ఆత్రం స‌క్కు

6. మెదక్‌ - పి. వెంకట్రామిరెడ్డి

7. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్- మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి

8. క‌రీంన‌గ‌ర్- బోయిన్‌పల్లి వినోద్ కుమార్

9. జ‌హీరాబాద్- గాలి అనిల్ కుమార్

10. ఖ‌మ్మం- నామా నాగేశ్వర్ రావు

11. చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

12. మ‌ల్కాజ్‌గిరి- రాగిడి ల‌క్ష్మారెడ్డి

13. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవ‌ర్ధన్

14. భువనగిరి- క్యామా మల్లేష్

15. నల్గొండ- కంచర్ల కృష్ణారెడ్డి

16. సికింద్రాబాద్- తీగుళ్ల పద్మారావుగౌడ్‌17. పెండింగ్

First Published:  24 March 2024 4:20 AM GMT
Next Story