Telugu Global
Telangana

కాంగ్రెస్ నేతల్లారా ఖబడ్దార్.. బండి సంజయ్ వార్నింగ్

ప్రజాహిత యాత్రపై దాడి చేయాలని చూసిన కాంగ్రెస్ శ్రేణులపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. `కాంగ్రెస్ నేతలరా ఖబడ్దార్` అంటూ హెచ్చరించారు.

కాంగ్రెస్ నేతల్లారా ఖబడ్దార్.. బండి సంజయ్ వార్నింగ్
X

బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట వద్దకు రాగానే కాంగ్రెస్, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బండి యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించాయి. యాత్రను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అలర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా నిలువరించారు. బీజేపీ నేతలను సైతం ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

ప్రజాహిత యాత్రపై దాడి చేయాలని చూసిన కాంగ్రెస్ శ్రేణులపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. `కాంగ్రెస్ నేతలరా ఖబడ్దార్` అంటూ హెచ్చరించారు. మరోవైపు ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలియడంతో అప్రమత్తమైన బీజేపీ శ్రేణులు బండి సంజయ్‌కు మద్దతుగా యాత్ర వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. తమ పార్టీ నాయకుడిని తాము కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  27 Feb 2024 7:04 AM GMT
Next Story