Telugu Global
Telangana

'శ్రీ చైతన్య'లో మరో సంఘటన, విద్యార్థిని ఆత్మహత్యా యత్నం? ... ఫర్నీచర్ ధ్వంసం చేసిన విద్యార్థి సంఘాలు

ఖమ్మం పట్టణంలోని శ్రీచైతన్య స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న సాయి శరణ్య అనే విద్యార్థిని పాఠశాల భవనం మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ బాలికకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

శ్రీ చైతన్యలో మరో సంఘటన, విద్యార్థిని ఆత్మహత్యా యత్నం? ... ఫర్నీచర్ ధ్వంసం చేసిన విద్యార్థి సంఘాలు
X

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకొని చనిపోయి రెండురోజులు కూడా గడవకముందే ఖమ్మంలోని శ్రీచైతన్య స్కూల్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

ఖమ్మం పట్టణంలోని శ్రీచైతన్య స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న సాయి శరణ్య అనే విద్యార్థిని పాఠశాల భవనం మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ బాలికకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు.

అయితే సాయి శరణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని ప్రమాదవశాత్తు కిందపడిందని పాఠశాల యాజ‌మాన్యం చెప్తోంది.

మరో వైపు విషయం తెలుసుకున్న వివిధ విద్యార్థి సంఘాలు శ్రీ చైతన్య స్కూల్ పై దాడికి దిగారు. స్కూలు లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పాఠశాల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

First Published:  3 March 2023 5:08 PM GMT
Next Story