Telugu Global
National

ఇంటి ముందు కారు పార్క్‌ చేశారని.. దారుణం

కర్ణాటక బెళగావికి చెందిన దంపతులు రోహిణి, సహిష్ణు ఈమధ్యే బెంగళూరులోని దొడ్డనేకుండి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్‌ అయ్యారు.

ఇంటి ముందు కారు పార్క్‌ చేశారని.. దారుణం
X

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తమ ఇంటి ముందు కారు పార్క్‌ చేశారని దంపతులపై పక్కింటి వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేశారు. బాధిత వ్యక్తిని పదేపదే చెప్పుతో కొడుతూ.. నేలకేసి కొట్టి, పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఘటనను వీడియో తీస్తున్న అతని భార్యపై కూడా దాడి చేశారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాటర్‌లోకి వెళ్తే.. కర్ణాటక బెళగావికి చెందిన దంపతులు రోహిణి, సహిష్ణు ఈమధ్యే బెంగళూరులోని దొడ్డనేకుండి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్‌ అయ్యారు. అపార్ట్‌మెంట్‌ వద్ద పక్కింటి ముందు ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్లేస్‌లో కారు పార్క్ చేశారు. అదే గొడవకు కారణమైంది. అనంతమూర్తి, ప్రశాంత్‌ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ పార్క్‌ చేసిన కారును చూపిస్తూ బాధితుడు సహిష్ణుపై దాడి చేశారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. కింద పడేసి తన్నారు. ఆపండి అని అన్నందుకు బాధితుడి భార్య రోహిణిని కూడా భాగ్యలక్ష్మి అనే మ‌హిళ‌ చితకబాదింది.

ఇరుగుపొరుగు వారు కూడా ఈ ఘటనను వీడియో తీశారు. బాధితులు ఒకరోజు క్రితమే ఆ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లోకి మారినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 354, 324, 506 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు.

First Published:  19 March 2024 9:37 AM GMT
Next Story