Telugu Global
National

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర లో ఎన్నికల‌ కౌంటింగ్ ప్రారంభం... బీజేపీ వైపు మొగ్గు

త్రిపురలో బీజేపీ 41 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి 4 సీట్లలో, తిప్రామోతా పార్టీ 6 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర లో ఎన్నికల‌ కౌంటింగ్ ప్రారంభం... బీజేపీ వైపు మొగ్గు
X

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్ ల ప్రకారం,BJP త్రిపురలో ముందంజలో ఉంది. నాగాలాండ్‌లో బిజెపి-ఎన్‌డిపిపి కూటమి ముందంజలో ఉండగా, మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పిపి ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు ఒక్క ఫలితం కూడా వెలువడనప్పటికీ ఆధిక్యాలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి.

త్రిపురలో బీజేపీ 41 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి 4 సీట్లలో, తిప్రామోతా పార్టీ 6 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

నాగాలాండ్ లో బీజేపీ 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 2 సీట్లలో, నాగా పీపుల్స్ ఫ్రంట్ 8 స్థానాల్లో, ఇతరులు 13 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

మేఘాలయలో బీజేపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, నేషనల్ పీపుల్స్ పార్టీ 29 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో, ఇతరులు 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

First Published:  2 March 2023 4:11 AM GMT
Next Story