Telugu Global
National

అమ్మానాన్న‌ల‌తో వెళ్లి...శ‌వంతో పెళ్లి.. నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియో

ఇక జీవితంలో తాను పెళ్లి చేసుకోనని కూడా అక్కడే శపథం చేశాడు. బిటుపన్ తములి చేసిన శపథానికి అక్కడ ఉన్న వారంతా మొద‌ట‌ ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత అతని నిజమైన ప్రేమని అర్థం చేసుకుని అండగా నిలిచి, అభినందించారు.

అమ్మానాన్న‌ల‌తో వెళ్లి...శ‌వంతో పెళ్లి.. నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియో
X

ప్రేమ పేరుతో హ‌త్య‌లు, మోసాలు చేస్తున్న ఈ రోజుల్లో... తాను ప్రాణంగా ప్రేమించిన యువ‌తి శ‌వానికే తాళి క‌ట్టి పెళ్లి చేసుకున్నాడో అస్సాం యువ‌కుడు. అదీ...త‌న త‌ల్లిదండ్రుల‌తో స‌హా వెళ్లి మ‌రీ ఈ పని చేశాడు. ఈ పెళ్లి ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ సంఘ‌ట‌న అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో జ‌రిగింది.

ప్రాథ‌నా బోరా అనే 24 ఏళ్ల యువ‌తి, బిటుప‌న్ త‌ములి అనే 27 ఏళ్ల యువ‌కుడు ప్రాణంగా ప్రేమించుకున్నారు. క‌లిసే జీవితం పంచుకోవాల‌ని శ‌ప‌థం చేసుకున్నారు. నిన్ను త‌ప్ప మ‌రో స్త్రీని పెళ్లి చేసుకోన‌ని బిటుప‌న్ ఆ అమ్మాయికి ప్రామిస్ చేశాడు. కానీ ఆ అమ్మాయి అనుకోకుండా అనారోగ్యానికి గురైంది. ఆమె కుటుంబ సభ్యులు బోరాను ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజులు చికిత్స అనంత‌రం యువతి చ‌నిపోయింది.

ఆమె మరణాన్ని బిటుపన్ తములి తట్టుకోలేకపోయాడు.ఆమెకి ముందే ప్రామిస్ చేసినట్లుగానే .. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆ చనిపోయిన యువతి మెడలో తాళి కట్టాడు త‌ములి. యువ‌తి కుటుంబ సభ్యులు వారించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. అంతేకాదు.. ఇక జీవితంలో తాను పెళ్లి చేసుకోనని కూడా అక్కడే శపథం చేశాడు. బిటుపన్ తములి చేసిన శపథానికి అక్కడ ఉన్న వారంతా మొద‌ట‌ ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత అతని నిజమైన ప్రేమని అర్థం చేసుకుని అండగా నిలిచి, అభినందించారు. ఇప్పుడు ఈ పెళ్లి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

First Published:  21 Nov 2022 7:36 AM GMT
Next Story