Telugu Global
National

గనిలో పడ్డ బస్సు.. 14 మంది మృతి

బస్‌లో ఉన్న వాళ్లంతా కూలీలే. ఓ సంస్థలో విధులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 45 అడుగుల లోతులో ఉన్న లోయ‌లో బస్సు పడిపోవడంతో పూర్తిగా ధ్వంసమైపోయింది.

గనిలో పడ్డ బస్సు.. 14 మంది మృతి
X

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారికి రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు.

బస్‌లో ఉన్న వాళ్లంతా కూలీలే. ఓ సంస్థలో విధులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 45 అడుగుల లోతులో ఉన్న లోయ‌లో బస్సు పడిపోవడంతో పూర్తిగా ధ్వంసమైపోయింది. బస్‌లో ఇరుక్కున్న వాళ్లని బయటకు తీసుకురావడం కష్టమైపోయింది. ప్రమాదానికి కారణమేంటన్న దానిపై విచారణ జరుగుతోంది.

దుర్గ్ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, స్థానిక పాలనా యంత్రాంగం.. బాధితులకు అన్ని విధాలా సాయపడుతున్నట్లు చెప్పారు.

First Published:  10 April 2024 6:53 AM GMT
Next Story