Telugu Global
International

యూట్యూబ్ సీఈఓ గా భారతీయుడు

ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులుండగా తాజాగా స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు.

యూట్యూబ్ సీఈఓ గా భారతీయుడు
X

అంతర్జాతీయంగా అనేక ప్రముఖ కంపెనీలను భారతీయులు లీడ్ చేస్తున్నారు. భారతీయులు తమ ప్రతిభతో అమెరికాలోని గొప్ప టెక్నాలజీ కంపెనీల్లో తమ‌ హవా కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులుండగా తాజాగా స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు.

ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన సూసన్ వొజిసికి వైదొలగడంతో యూట్యూబ్‌లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న నీల్ మోహన్‌ను సంస్థ యాజమాన్యం సీఈవోగా నియమించింది.

నీల్ మోహన్ 2008 నుంచి గూగుల్‌లో పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్, స్టిచ్ ఫిక్స్, జెనోమిక్స్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ ‘23 అండ్ మి’లోనూ పనిచేశారు. ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ చేశారు.

కాగా యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్ కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు.

First Published:  17 Feb 2023 1:44 AM GMT
Next Story