Telugu Global
CRIME

ఛీఛీ... మీరేం కొడుకులురా బాబు

ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే కొట్టి చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఛీఛీ... మీరేం కొడుకులురా బాబు
X

ఆస్తికోసం కన్న తల్లిదండ్రుల్నే కొట్టి చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నప్పుడు పిల్లల్ని భుజాల మీద మోసి, పెంచిన తల్లిదండ్రులు అపుడు కాలితో తంతే మురిసిపోతుంటారు. పిల్లలే తమ ఆస్తిగా బతుకుతారు. కానీ అదే కొడుకు పెద్దయ్యాక ఆస్తి కోసం చచ్చేలా కొడితే… శాశ్వతంగా కన్నుమూస్తున్నారు.

తల్లి కాళ్లకు కరెంట్‌ వైర్లు పెట్టి..

ఆస్తి కోసం పెంచిన తల్లిని చిత్రహింసలకు గురిచేసి చంపిన ఘటన పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం శంకరాపురంలో జరిగింది. బాణావత్ లక్ష్మీబాయి సవతి కొడుకు దత్తు నాయక్‌ను చిన్నప్పటి నుండి పెంచింది. దత్తు నాయక్‌ కొన్ని రోజులుగా ఇంటిని తన పేరుపైన రాయాలని లక్ష్మీబాయిని వేధిస్తున్నాడు.

దీనికి ఒప్పుకోకపోవడంతో అర్ధరాత్రి లక్ష్మీభాయి నిద్రిస్తుండగా ఆమె కాళ్లకు కరెంట్ వైర్లను పెట్టి చిత్రహింసలకు గురిచేసి ఆమె తలపై గునపంతో కొట్టి హత్య చేశాడు.


తండ్రిపై పిడిగుద్దుల వర్షం..

ఇలాంటి ఘటనే కర్ణాటకలోనూ జరిగింది. ఆస్తి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని చావగొట్టాడు ఓ కొడుకు. కుర్చీలో కూర్చున్న నాన్నపై పిడిగుద్దుల వర్షం కురించాడు. కాలితో మొహం మీద బలంగా తన్నాడు. దీంతో విలవిలలాడిపోయిన ఆ తండ్రి అక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ తండ్రి శరీరం తట్టుకుంది. కానీ మనసు తట్టుకోలేక పోయింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు గుండెపోటుతో చనిపోయాడు. దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. గత ఏప్రిల్ 25న కొడుకును అరెస్ట్ చేశారు.



First Published:  1 May 2024 8:03 AM GMT
Next Story