Telugu Global
CRIME

క్యాబ్ డ్రైవర్ ను వాహనం నుంచి తోసేసి ఈడ్చుకెళ్లిన దొంగలు

ఢిల్లీలో దొంగలు చెలరేగిపోయారు. మంగళవారం రాత్రి ఓ క్యాబ్ ని ఆపి అందులోని డ్రైవర్ ను కిందకు తోసేశారు. అడ్డొచ్చిన అతడిని ఢీ కొట్టి 200 మీటర్లు ఈడ్చుకు వెళ్లారు.

క్యాబ్ డ్రైవర్ ను వాహనం నుంచి తోసేసి ఈడ్చుకెళ్లిన దొంగలు
X

ఢిల్లీలో దొంగలు చెలరేగిపోయారు. మంగళవారం రాత్రి ఓ క్యాబ్ ని ఆపి అందులోని డ్రైవర్ ను కిందకు తోసేశారు. అడ్డొచ్చిన అతడిని ఢీ కొట్టి 200 మీటర్లు ఈడ్చుకు వెళ్లారు. ఈ సంఘటనలో క్యాబ్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. కాగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు కావడంతో అవి వైరల్ గా మారాయి. ఫరీదాబాద్ కు చెందిన బిజేంద్ర(45) క్యాబ్ నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా బిజేంద్ర మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో వసంత్ కుంజ్ లోని మహిపాల్ పూర్ ప్రాంతంలో వెళుతుండగా కొంతమంది దుండగులు వాహనానికి అడ్డంగా నిల్చుని ఆపారు.

ఆ తర్వాత వారు బిజేంద్రపై దాడికి పాల్పడ్డారు. వాహనంలో నుంచి అతడిని కిందకు తోసేశారు. దుండగులు కారు తీసుకుని పరార్ అవుతుండడంతో బిజేంద్ర వాహనానికి అడ్డంగా నిలబడ్డాడు. దీంతో దుండగులు అతన్ని ఢీ కొట్టి అలాగే ఈడ్చుకుంటూ వెళ్లారు. అలా 200మీటర్ల దూరం వరకు దుండగులు బిజేంద్రను ఈడ్చుకు వెళ్లడంతో అతడి శరీరం ఛిద్రంగా మారింది. తీవ్రగాయాలతో బిజేంద్ర అక్కడికక్కడే చనిపోయాడు.

స్థానికులు గమనించి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. సీసీ టీవీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది.

First Published:  11 Oct 2023 11:12 AM GMT
Next Story