Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | మహేష్ సినిమాకు ప్రత్యేక అనుమతులు

Guntur Kaaram - మహేష్ హీరోగా నటించిన గుంటూరుకారం సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేసింది.

Guntur Kaaram | మహేష్ సినిమాకు ప్రత్యేక అనుమతులు
X

గుంటూరు కారం సినిమాకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక అనుమతులిచ్చింది. సంక్రాంతి కానుకగా 12వ తేదీన థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 11వ తేదీ అర్థరాత్రి ఒంటిగంట నుంచే గుంటూరుకారం బెనిఫిట్ షోలు మొదలుకాబోతున్నాయి. ఈ మేరకు 23 థియేటర్లకు పర్మిషన్ దక్కింది.

హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఏఎంబీ, సుదర్శన్, శ్రీరాములు, నెక్సెస్ మాల్ లాంటి ఎన్నో మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో గుంటూరుకారం బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు. దీంతో పాటు ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ ఏరియాల్లో కూడా రాత్రి ఒంటిగంట షోలు పడబోతున్నాయి.

ఇక టికెట్ రేట్ల విషయానికొస్తే, నైజాంలోని సింగిల్ స్క్రీన్స్ లో గుంటూరుకారం సినిమాకు 65 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 100 రూపాయలు పెంపు ప్రకటించారు. పెంచిన టికెట్ రేట్లు 12వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ అర్థరాత్రి వరకు అమల్లో ఉంటాయి.

దాదాపు పుష్కర కాలం తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 Jan 2024 4:55 PM GMT
Next Story