Telugu Global
Cinema & Entertainment

Pooja Hegde - గుంటూరు కారం నుంచి పూజా ఔట్?

Pooja Hegde Guntur Kaaram - మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

Pooja Hegde
X

Pooja Hegde: సగం సగం వద్దంటున్న పూజా హెగ్డే

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోంది గుంటూరు కారం సినిమా. ఈ మూవీపై ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు షూటింగ్ అప్ డేట్స్ పై పుకార్లు వచ్చాయి, ఈమధ్య తమన్ పై పుకార్లు వచ్చాయి. ఈ ప్రాజెక్టు నుంచి తమన్ ను తొలిగించారనేది ఆ ప్రచారం. ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డేపై రూమర్స్ మొదలయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం, గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేను తొలిగించారట. ప్రస్తుతం ఆమె కెరీర్ బాగాలేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈమధ్య ఫ్లాపులు చూసింది. ఈ నేపథ్యంలో గుంటూరు కారం నుంచి పూజాహెగ్డేను తొలిగించినట్టు తెలుస్తోంది. ఈ మార్పు త్రివిక్రమ్ కు ఇష్టంలేనప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందంట.

పూజా హెగ్డే స్థానంలో, ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలలనే మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. స్వయంగా మహేష్ బాబు కనుసన్నల్లో ఈ మార్పులన్నీ జరిగినట్టు తెలుస్తోంది.

శ్రీలీల చేతిలో ఇప్పటికే అరడజను సినిమాలున్నాయి. ఇప్పటికే ఆమె పవన్ కల్యాణ్ సరసన మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రధాన నటిగా ఇది ఆమెకు మరో పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది.

ఈ సినిమా షూటింగ్ కు చాలా రోజులుగా విరామం ఇచ్చారు. దాదాపు 2 నెలలుగా మూవీ సెట్స్ పైకి రాలేదు. ఎట్టకేలకు ఈనెల 24 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 2024లో విడుదల కానుంది.

First Published:  20 Jun 2023 12:27 PM GMT
Next Story