Telugu Global
Cinema & Entertainment

Nagarjuna | మళ్లీ కలిసిన మన్మధుడు జోడీ

Nagarjuna and Anshu - మన్మధుడు జోడీ మళ్లీ కలిసింది. గత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది.

Nagarjuna | మళ్లీ కలిసిన మన్మధుడు జోడీ
X

కింగ్ నాగార్జున కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది మన్మథుడు. విజయ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ కథ-మాటలు అందించిన ఈ కూల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి వచ్చి 22 ఏళ్లవుతోంది. మన్మథుడు సినిమాలో అభిగా నాగార్జున, మహి క్యారెక్టర్ లో అన్షు జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అన్షు పెళ్లయ్యాక కుటుంబంతో లండన్ లో స్థిరపడింది.

ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది. హైదరాబాద్ లోని తన స్నేహితులను మీట్ అవుతోంది. ఈ సందర్భంగా అన్షు ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి నాగార్జున, అమల హాజరయ్యారు.

ఇన్నేళ్ల తర్వాత ఈ పార్టీలో మన్మథుడు జంట నాగార్జున, అన్షు కలిశారు. తాము కలిసి నటించిన మెమొరీస్ షేర్ చేసుకున్నారు. నాగార్జున, అన్షు మీట్ అయిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభి, మహి బెస్ట్ పెయిర్ అంటూ నెటిజన్స్ స్పందిస్తున్నారు.

మన్మధుడు సినిమాలో నాగ్-అన్షు కాంబినేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వీళ్ల రొమాంటిక్ కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ అయింది. ఆ మూవీ తర్వాత పెద్దగా కెరీర్ లో రాణించలేదు అన్షు. పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు నాగ్ ను కలిసింది.

First Published:  4 March 2024 4:47 PM GMT
Next Story