Telugu Global
Cinema & Entertainment

Rajendra Prasad | మళ్లీ తెరపైకి లేడీస్ టైలర్ జంట

Rajendra Prasad - రాజేంద్రప్రసాద్ కెరీర్ లో డిఫరెంట్ మూవీ లేడీస్ టైలర్. మళ్లీ ఇన్నేళ్లకు ఆ మూవీ జోడీ కలిసింది. ఓ సినిమా చేస్తోంది.

Rajendra Prasad | మళ్లీ తెరపైకి లేడీస్ టైలర్ జంట
X

రూపేష్ కథానాయకుడిగా 'మా' ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'షష్టిపూర్తి'. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులు. క్లాసిక్ ఫిల్మ్ 'లేడీస్ టైలర్' విడుదలైన 37 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ హీరోయిన్. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తి అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. లుక్ చాలా బావుందని, దర్శకుడు పవన్ ప్రభకు ఇది తొలి చిత్రమైనప్పటికీ చక్కగా డిజైన్ చేశారని, సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించాడు.

పిల్లలు తమ తల్లిదండ్రుల పెళ్లి చూడలేరు. షష్టిపూర్తి ద్వారా ఆ లోటు తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. ఆ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. కొంత టాకీ, ఇంపార్టెంట్ యాక్షన్ సీన్ ఒకటి బాలన్స్ ఉంది. ఆ యాక్షన్ సీన్ కోసం హీరో రూపేష్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇందులో వాళ్ళిద్దరూ వివిధ వయసుల్లో కనిపిస్తారు. ఓ రెట్రో ఎపిసోడ్ కూడా వాళ్లపై తీశారు. వాళ్ళిద్దరూ 30 ఏళ్ళ క్రితం ఎలా ఉండేవారో అందులో అలా ఉంటారు. యానాం సమీపంలోని తాతపూడిలో ఈ సినిమా తీశారు. సినిమాలో మొత్తం 80 లొకేషన్లు ఉన్నాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం చిత్రీకరణ జరిగింది.

సినిమాలో 5 పాటలు ఉన్నాయి. ఒక్క పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి చిత్రీకరించగా... మిగతా పాటలను గోదావరి ప్రాంతంలో తీశారు. ఇదొక మంచి మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా అవుతుందంటున్నారు మేకర్స్.

First Published:  29 Nov 2023 4:41 PM GMT
Next Story