Telugu Global
Cinema & Entertainment

Kamal Hassan: 35 ఏళ్ల తర్వాత కలిశారు

35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిశారు. వీరి కాంబో లో సినిమా అనౌన్స్ అయింది.

Kamal Hassan: 35 ఏళ్ల తర్వాత కలిశారు
X

రజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై ఓ క్రేజీ మూవీ సెట్ అయింది. ఈ బ్యానర్లపై మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ సినిమా చేయబోతున్నారు. కమల్ హాసన్ కు కెరీర్ లో ఇది 234వ చిత్రం. 2024లో సినిమా థియేటర్లలోకి వస్తుంది.


కమల్ హాసన్, మణిరత్నం లాంటి ఇద్దరు దిగ్గజాలు కలిసి సినిమా చేయడం చాలా పెద్ద విషయం. అప్పుడెప్పుడో 35 ఏళ్ల కిందట వీళ్లిద్దరూ కలిసి సినిమా చేశారు. అదే నాయకుడు సినిమా. అదో కల్ట్ క్లాసిక్ మూవీ. ఆ సినిమా తర్వాత, వీళ్లిద్దరూ కలిసి పనిచేయడం ఇదే.


ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించడం మరో పెద్ద విశేషం. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిన్నారు.


మణిరత్నంతో లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు కల్ హాసన్. "35 సంవత్సరాల క్రితం మణిరత్నంతో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉంది. ఈ ఉత్సాహానికి రెహమాన్ కూడా తోడయ్యారు." అంటూ స్పందించారు.

First Published:  7 Nov 2022 7:45 AM GMT
Next Story