Telugu Global
Cinema & Entertainment

Jayasudha | రూ.100 కోట్లు మిస్ చేసుకున్న జయసుధ

Jayasudha - శోభన్ బాబు ముందుచూపు ఎలాంటిదో మరోసారి తెలిసొచ్చింది. నటి జయసుధ, శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

Jayasudha | రూ.100 కోట్లు మిస్ చేసుకున్న జయసుధ
X

ముందు చూపు అంటే ఎలా ఉంటుందో శోభన్ బాబును చూసి నేర్చుకోవాలంటారు చాలామంది. ఆయనలా భూములపై పెట్టుబడులు పెట్టిన నటుడు మరొకరు కనిపించరు. ఈ విషయాన్ని మురళీమోహన్ నుంచి చాలామంది నటులు చెప్పుకొస్తారు. తాజాగా జయసుధ కూడా శోభన్ బాబు గొప్పదనాన్ని చెప్పుకొచ్చారు.

గతంలో ఆయన ఇచ్చిన సలహా పాటించకపోవడం వల్ల వంద కోట్లు నష్టపోయానని వెల్లడించారు. శోభన్ బాబుతో కలిసి పనిచేస్తున్న రోజుల్లో జయసుధకు ఆయన మంచి సలహా ఇచ్చారట. చెన్నైలోని అన్నా నగర్ లో ఓ స్థలం చూపించి అది కొనుక్కోమని చెప్పారట. అప్పుడు ఆ స్థలంలో పందులు, చెత్తాచెదారం ఉండేవంట.

అలాంటి స్థలం కొనమంటారేంటని జయసుధ విసుక్కుందంట. శోభన్ బాబు చెప్పిన సలహాను ఆమె పాటించలేదు. ఆయన చెప్పినప్పుడు ఆ స్థలం ఖరీదు 25 వేల రూపాయలంట. ఇప్పుడు అదే స్థలం వంద కోట్ల రూపాయలుంది. కనీసం అక్కడ గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి ఉంది.

శోభన్ బాబు సలహాను పాటించి ఉంటే తనకు ఇప్పుడు అక్కడ వంద కోట్ల ఆస్తి ఉండేదని చెప్పుకొచ్చారు జయసుధ. డబ్బు విషయంలో తను ఎప్పుడూ ముందుచూపుతో వ్యవహరించలేదని ఆమె అన్నారు.

First Published:  9 March 2024 5:20 AM GMT
Next Story