Telugu Global
Cinema & Entertainment

జానీ మాస్టర్ హీరోగా సినిమా

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా మారాడు. యాథారాజ తథాప్రజ అనే కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.

జానీ మాస్టర్ హీరోగా సినిమా
X

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా 'యథా రాజా తధా ప్రజా' సినిమా పూజా కార్యక్రమాలతో పార్రంభం అయ్యింది. ఇందులో 'సినిమా బండి' ఫేమ్ వికాస్ మరో హీరో. శ్రష్టి వర్మ హీరోయిన్. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు.

ముహూర్తపు సన్నివేశానికి హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శ్రీనివాస్ విట్టల దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు.. హరీష్ పటేల్‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

రాజకీయ వార్తలు అంటే గతంలో 10 నిమిషాలు టీవీల్లో చూపించేవారు. ఇప్పుడు 24/7 రాజకీయ వార్తలు వస్తున్నాయి. రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించే అంశం అయ్యింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఇందులో సందేశంతో పాటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. 3 షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేయాలనేది ప్లాన్. సినిమాలో 4 పాటలుంటాయి. రధన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ సినిమాకు యథారాజా తథాప్రజ అనే టైటిల్ పెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈసినిమాను తెరకెక్కించి, 3 భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామంటున్నారు మేకర్స్.

First Published:  23 Aug 2022 4:05 AM GMT
Next Story