Telugu Global
Andhra Pradesh

కడపలో షర్మిల vs వైసీపీ కార్యకర్త.. వీడియో వైరల్

పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్‌ పేదల కోసం తిరుగుతున్నాడని.. సమస్యలు ఉంటే విన్నాడని, తమ కోసం వచ్చాడని ఆ కార్యకర్త చెప్పుకొచ్చాడు. జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాడని చెప్పాడు.

కడపలో షర్మిల vs వైసీపీ కార్యకర్త.. వీడియో వైరల్
X

ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలకు షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌కు ఎందుకు ఓటేయాలని షర్మిల ప్రశ్నించారు. దీంతో కలగజేసుకున్న ఓ కార్యకర్త జగన్‌ ఏం చేశాడో తాను చెప్తానంటూ ముందుకొచ్చారు. షర్మిల చేతి నుంచి మైక్‌ తీసుకున్న ఆ కార్యకర్త జగన్‌ చేసిన మంచి పనుల గురించి ఏకధాటిగా ప్రసంగించారు.


పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్‌ పేదల కోసం తిరుగుతున్నాడని.. సమస్యలు ఉంటే విన్నాడని, తమ కోసం వచ్చాడని ఆ కార్యకర్త చెప్పుకొచ్చాడు. జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాడని చెప్పాడు. 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్‌ పేదల కష్టాలు విన్నాడని గుర్తు చేశాడు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చి న్యాయం చేశాడన్నాడు. ఇవాళ ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిందంటే.. దానికి కారణం జగన్‌మోహన్ రెడ్డేనన్నారు ఆ కార్యకర్త. భవిష్యత్తులోనూ జగన్‌ తమ కోసం ఉంటాడన్న నమ్మకం ఉందన్నారు కార్యకర్త. తెలంగాణలో అక్కడి ప్రజల కోసం ఉంటానని చెప్పి..కనీసం పోటీ కూడా చేయలేదని షర్మిలనూ ప్రశ్నించాడు. ఇక ఆ కార్యకర్త ప్రసంగానికి అక్కడి జనం విజిల్స్‌,కేకలతో హోరెత్తించారు.

First Published:  8 April 2024 3:10 PM GMT
Next Story