Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఏ పిచ్చిపని చేసినా.. పవన్ కల్యాణ్‌కు దేవుడే

పిచ్చి ముదిరే ఇవాళ అవ్వాతాతల దగ్గరికి పెన్షన్ రాకుండా చేశారని మండిపడ్డారు పోసాని. ఇవాళ చంద్రబాబు చేసిన పనితో కుంటివాళ్లు, గుడ్డివాళ్లు, కుష్టు రోగులు నానా అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఏ పిచ్చిపని చేసినా.. పవన్ కల్యాణ్‌కు దేవుడే
X

అధికారం లేకపోతే చంద్రబాబు ఉండలేరన్నారు ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి. పదవి లేకపోతే బాబుకు పిచ్చెక్కుతుందన్నారు. ఆ పిచ్చిని జనానికి ఎక్కిస్తాడన్నారు. కులాల మధ్య, మతాల మధ్య గొడవలు సృష్టిస్తాడన్నారు.

గతంలో వంగవీటి రంగాను చంపినప్పుడు కులాల మధ్య గొడవలు ఎలా జరిగాయో, అలా చేస్తాడన్నారు. ఆ పిచ్చి ముదిరే ఇవాళ అవ్వాతాతల దగ్గరికి పెన్షన్ రాకుండా చేశారని మండిపడ్డారు పోసాని. ఇవాళ చంద్రబాబు చేసిన పనితో కుంటివాళ్లు, గుడ్డివాళ్లు, కుష్టు రోగులు నానా అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లాడు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయాడు. నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడు. వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నాడు.

ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్‌ను చంపేశాడు. చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు. చంద్రబాబు కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశాడు. పవన్‌ కల్యాణ్‌ను లొంగదీసుకున్నాడు. అందుకే చంద్రబాబు ఎలాంటి పిచ్చిపనులు చేసినా పవన్ కల్యాణ్‌కు దేవుడే. నాడు కాపులను గూండాలు, రౌడీలు అన్న చంద్రబాబు.. ఇవాళ మీ కాపుల ఓట్లతోనే గెలుస్తానని ఛాలెంజులు విసురుతున్నాడు" అని నిప్పులు చెరిగారు పోసాని కృష్ణమురళి.

First Published:  5 April 2024 2:09 PM GMT
Next Story