Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు వంటి నమ్మక ద్రోహి దేశంలోనే లేడు

వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా ముందు చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించలేదు. వైఎస్సార్ సీఎం కాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

చంద్రబాబు వంటి నమ్మక ద్రోహి దేశంలోనే లేడు
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వంటి నమ్మక ద్రోహి దేశంలో మరొకరు లేరు. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కడపలో ముస్లింల ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాను పిలిపించుకుని ప్రచారం చేయించుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా హౌస్ అరెస్టయితే కనీసం పలకరించిన పాపాన పోలేదు. దీంతో కడుపు మండిన ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా.. చంద్రబాబు వంటి నమ్మకద్రోహిని దేశంలోనే చూడలేదని మండిపడ్డారు. ఈ విషయం చంద్రబాబుకు గుర్తుందా..?

వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా ముందు చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించలేదు. వైఎస్సార్ సీఎం కాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రంజాన్ తోఫా అంటూ హెరిటేజ్ లో మిగిలిన సరుకులను ఇచ్చి పండుగ చేసుకోండని ముస్లింలకు చెప్పారు.

నారా హమారా పేరుతో చంద్రబాబు తలపెట్టిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో పలు హామీలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీల సంగతేమిటని అడిగినందుకు ఆయన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టించి, వారిని చిత్రహింసలకు గురిచేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత వాటిని ఎత్తి వేయించారు.

మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, అత్తర్ చాంద్ బాషాలను టీడీపీలోకి తీసుకుని వారికి మంత్రి పదవులు ఇవ్వకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ముస్లింలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా నమ్మక ద్రోహం చేసిన చరిత్ర చంద్రబాబుది. అవన్నీ ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. కానీ ముస్లింలు వాటిని మరిచిపోతారని చంద్రబాబు అనుకుంటే అది పొరపాటే.

First Published:  6 April 2024 11:29 AM GMT
Next Story