Telugu Global
Andhra Pradesh

జనసేనకు చిరంజీవి విరాళం..ఎన్ని కోట్లంటే..?

పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు పవన్‌కల్యాణ్‌. అనంతరం ముగ్గురు సోదరులు కాసేపు చర్చలు జరిపారు.

జనసేనకు చిరంజీవి విరాళం..ఎన్ని కోట్లంటే..?
X

జ్వరం కారణంగా ఎన్నికల ప్రచారానికి విరామ ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. తన సోదరుడు చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లో విశ్వంభర షూటింగ్ లోకేషన్‌లో చిరంజీవిని కలిశారు. ఈ సమయంలో మరో సోదరుడు నాగబాబు సైతం పవన్‌ వెంటే ఉన్నారు.


పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు పవన్‌కల్యాణ్‌. అనంతరం ముగ్గురు సోదరులు కాసేపు చర్చలు జరిపారు. జనసేన పార్టీ కోసం తనవంతుగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఇందుకు సంబంధించిన చెక్కును పవన్‌కల్యాణ్‌కు అందించారు.

First Published:  8 April 2024 12:15 PM GMT
Next Story