Telugu Global
Andhra Pradesh

కొడాలి నాని.. ఈరోజు వీర ఉతుకుడు

బాబు, కొడుకులు మగాళ్లయితే గుడివాడ, గన్నవరం వచ్చి పోటీ చేయాలన్నారు. మహానాడు పేరుతో స్క్రాప్ బ్యాచ్ అంతా ఒకేచోట చేరిందన్నారు.

కొడాలి నాని.. ఈరోజు వీర ఉతుకుడు
X

టీడీపీ మహానాడుపై ఇప్పటికే వైసీపీ నేతలంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాయించేశారు. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రెండో రౌండ్ మొదలైంది. అందరి తిట్లు ఒకెత్తు అయితే మాజీ మంత్రి కొడాలి నాని వాయింపుడు మాత్రం మరో లెవల్ లో ఉంది. గతంలోకంటే మరింత దారుణంగా చంద్రబాబు, లోకేష్ ని చెడామడా తిట్టారు కొడాలి నాని. --నాకడం, --పీకడం వంటి పడికట్టు పదాలు, పంది, ఎద్దు, దున్న, సిగ్గు, లజ్జ, మగాడివైతే, దమ్ముంటే, స్క్రాప్ నాకొ--లు వంటి ఘాటు పదాలతో కాస్త గట్టిగానే చాకిరేవు పెట్టారు.

ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు కొడాలి నాని. తెలంగాణలో పార్టీని చంపేసి, ఏపీలో 23 సీట్లతో దారుణ పరాభవం తర్వాత చంద్రబాబుకి సొంతగా గెలవలేమని తెలిసొచ్చిందని అందుకే పవన్ కల్యాణ్, సీబీఐ -- నాకుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ ఈయనవైపు చూడకపోయినా పొత్తులకోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.

లోకేష్, అచ్చెన్నకు కూడా..

సెంటు భూమిపై సెటైర్లు వేసిన అచ్చెన్నాయుడిపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొడాలి నాని. అచ్చెన్నాయుడికి ఇల్లు సరిపోదని, పశువుల పాక కావాలని, ఆయన గడ్డివాము వేసుకోడానికి సెంటు భూమి సరిపోదని మండిపడ్డారు నాని. లోకేష్ ని జనంమీదకు వదిలారని, ఏం సాధించారని ప్రశ్నించారు. టీడీపీని నందమూరి వారసులు తీసేసుకుంటే అప్పుడు లోకేష్, చంద్రబాబు హెరిటేజ్ పాలకోవాలు అమ్ముకుంటూ కర్నాటక సరిహద్దుల్లోకి వెళ్లాల్సిందేనని సెటైర్లు పేల్చారు.

మగాళ్లయితే రండి..

బాబు, కొడుకులు మగాళ్లయితే గుడివాడ, గన్నవరం వచ్చి పోటీ చేయాలన్నారు. మహానాడు పేరుతో స్క్రాప్ బ్యాచ్ అంతా ఒకేచోట చేరిందన్నారు. ఎన్టీఆర్ చేసిన గొప్ప విషయాలను ఎవరూ మరచిపోలేదని, ఆయనపై నిందలు వేసింది, ఆయన్ని తిట్టింది, వెన్నుపోటు పొడిచింది, వ్యతిరేకంగా లేఖలు రాసింది కూడా చంద్రబాబేనని గుర్తు చేశారు. ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటే ఏంటని ప్రశ్నించారు నాని. అదేమైనా బట్టల షాపా, బంగారం షాపా అని అన్నారు.

First Published:  28 May 2023 12:13 PM GMT
Next Story