Telugu Global
Andhra Pradesh

జాతీయ సర్వేల్లోనూ మళ్లీ వైసీపీదే అధికారం

టైమ్స్‌ నౌ ఈటీజీ సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాలు వైసీపీ గెలవనుంది. టీడీపీ కూటమికి 4నుంచి 5 స్థానాలు రానున్నాయి.

జాతీయ సర్వేల్లోనూ మళ్లీ వైసీపీదే అధికారం
X

రాష్ట్రంలో YSRCP మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయస్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి.

గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో జగన్‌ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయస్థాయిలో పలు సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. తాజాగా టైమ్స్‌ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

టైమ్స్‌ నౌ ఈటీజీ సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాలు వైసీపీ గెలవనుంది. టీడీపీ కూటమికి 4నుంచి 5 స్థానాలు రానున్నాయి.

టైమ్స్‌ నౌ ఈటీజీ సర్వే ఫలితాలు ఇలా..

వైసీపీ: 19-20

టీడీపీ: 3-4

జనసేన: 0

బీజేపీ: 1

ఇతరులు: 0

First Published:  18 April 2024 1:49 AM GMT
Next Story