Telugu Global
Andhra Pradesh

నువ్వు రాజకీయాల్లో బచ్చావి –చేగొండి సంచలన లేఖ

అమర్నాథ్, జనసేన నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో ఇప్పుడు చేగొండి హరిరామ జోగయ్య ఎంటరయ్యారు. గుడివాడ అమర్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కి మద్దతుగా ఆయన ఓ లేఖ రాశారు.

నువ్వు రాజకీయాల్లో బచ్చావి –చేగొండి సంచలన లేఖ
X

ఇటీవల కాలంలో కాపు రిజర్వేషన్ల విషయంలో సీఎం జగన్ కి లేఖాస్త్రాలు సంధిస్తూ, ఆమరణ నిరాహార దీక్షతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చారు కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామ జోగయ్య. తాజాగా ఆయన, మంత్రి గుడివాడ అమర్నాథ్ కి కూడా ఓ లేఖ రాశారు.


అయితే ఆ లేఖలో ఆయన వాడిన భాష ఇప్పుడు సంచలనంగా మారింది. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయావంటూ ఆయన మంత్రి అమర్నాథ్ పై ఆ లేఖలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ పై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు హరిరామ జోగయ్య.




ఇటీవల పవన్ కళ్యాణ్ పై ఐటీ మంత్రి అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ టీడీపీ లో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే అని అన్నారు. పవన్, చంద్రబాబు.. లోకేష్ ని చెరో భుజంపై మోయడానికి సిద్ధమయ్యారన్నారు.


కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్ధం అయ్యారని మండిపడ్డారు. మంత్రి కామెంట్స్ పై జనసేన కూడా కౌంటర్ ఎటాక్ చేసింది. మంత్రి అమర్నాథ్ సీఎం జగన్ కి బానిసగా మారాడన్నారు జనసేన నాయకులు. ఆయన గాలికి మంత్రి అయ్యారని.. విజ్ఞత, విచక్షణ ఆయనకు లేవనన్నారు.


పద్ధతి, ప్రోటోకాల్ తెలియని వాడు మంత్రి అవ్వడం ఏపీ ప్రజల దురదృష్టం అని అన్నారు జనసేన నాయకులు. అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే మరిం తీవ్రంగా స్పందిచాల్సి వస్తుందని జనసేన నేతలు హెచ్చరించారు.

అమర్నాథ్, జనసేన నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో ఇప్పుడు చేగొండి హరిరామ జోగయ్య ఎంటరయ్యారు. గుడివాడ అమర్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కి మద్దతుగా ఆయన ఓ లేఖ రాశారు. “నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకు..అనవసరంగా పవన్ కల్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు..నీ మంచి కోరి చెబుతున్నా” అని తన లేఖలో పేర్కొన్నారు హరిరామజోగయ్య.


హరిరామ జోగయ్య రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయకు కౌంటర్ ఇవ్వలేక, పవన్ కల్యాణ్ పై తన వ్యాఖ్యలను సమర్థించుకోలేక సతమతం అవుతున్నారు అమర్నాథ్.

First Published:  5 Feb 2023 2:26 PM GMT
Next Story