Telugu Global
Andhra Pradesh

క్లారిటీ వచ్చేసింది.. రఘురామరాజుకు ఉండి ఫిక్స్‌

ఉండి టికెట్‌ RRRకు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నప్పటి నుంచే రామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ కన్నీరు కూడా పెట్టుకున్నారు.

క్లారిటీ వచ్చేసింది.. రఘురామరాజుకు ఉండి ఫిక్స్‌
X

ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీపై క్లారిటీ వచ్చేసింది. ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆయనకు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఉండి టికెట్‌ను ఖాయం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జోనల్ ఇన్‌ఛార్జుల సమావేశంలో ఉండి టికెట్‌ను రఘురామరాజుకు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఉండి టికెట్‌ రఘురామకృష్ణరాజుకు ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు షాకిచ్చినట్లయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు కట్టబెట్టిన చంద్రబాబు.. ఇటీవల పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజు కోసం రామరాజును బలిచేశారు.

ఉండి టికెట్‌ RRRకు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నప్పటి నుంచే రామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ కన్నీరు కూడా పెట్టుకున్నారు. రామరాజు అనుచరులు సైతం భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రామరాజుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కేడర్‌ అభిప్రాయాన్ని ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు.. RRRకే టికెట్ ఖాయం చేశారు. తాజాగా టికెట్ RRRకే ఖాయం చేయడంతో రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఉండిలో శివరామరాజు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రామరాజు కూడా రెబల్‌గా బరిలో ఉంటే.. RRRకు గడ్డు పరిస్థితే.

First Published:  20 April 2024 4:02 AM GMT
Next Story