Telugu Global
Andhra Pradesh

ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా.. ఉత్తమ వెధవ, ఉత్తమ సన్నాసి..

ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా కాదు.. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు అనే అవార్డులు ఇవ్వాలని అశ్వినీదత్ కి చురకలంటించారు పోసాని కృష్ణమురళి.

ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా.. ఉత్తమ వెధవ, ఉత్తమ సన్నాసి..
X

నంది అవార్డుల విషయంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చిచ్చు పెట్టాయి. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అనే కేటగిరీల్లో అవార్డులు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు అశ్వినీదత్. దీనిపై సినీ పరిశ్రమ నుంచే వైసీపీ అనుకూల వర్గం ఘాటుగా స్పందించింది. అశ్వినీ దత్ వ్యాఖ్యలను నటుడు, రచయిత, ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఖండించారు. అదే స్టైల్ లో ఆయనకు జవాబిచ్చారు.

ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా కాదు.. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు అనే అవార్డులు ఇవ్వాలని అశ్వినీదత్ కి చురకలంటించారు పోసాని కృష్ణమురళి. ఉత్తమ వెధవలు.. ఉత్తమ సన్నాసులు అనే అవార్డులు కూడా మీ వాళ్లకే దక్కుతాయని పరోక్షంగా టీడీపీ నేతల్ని విమర్శించారు

అసలు సీఎం జగన్ మీకు ఏం అన్యాయం చేశారని, మీరంతా ఎందుకు జగన్ మీద పడి ఏడుస్తున్నారని ప్రశ్నించారు పోసాని. చంద్రబాబులాగా వెన్నుపోటు పొడిచాడా, ఎవరికైనా అన్యాయం చేశాడా అని అడిగారు. ఎన్టీఆర్‌ ను చంద్రబాబు చెప్పులతో కొట్టించినప్పుడు అశ్వినీదత్ ఏం చేస్తున్నారని అన్నారు. నీ బతుకు నాకు తెలుసు.. నా బతుకు నీకు తెలుసు.. ఇప్పటికైనా కొంచెం నీతితో జీవించు అంటూ అశ్వినీదత్ కి హితవు పలికారు పోసాని. నంది అవార్డులు లేట్ అయి ఉండొచ్చని, అయితే కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోయాయని, ముందు ప్రజల్ని కాపాడుకోవడమే ప్రభుత్వ విధి అని చెప్పారు. నంది అవార్డులు ఇస్తే, ఎవరూ వంక పెట్టని విధంగా ఇస్తామని చెప్పారు పోసాని.

First Published:  2 May 2023 1:27 AM GMT
Next Story