Telugu Global
Andhra Pradesh

హెరిటేజ్ డాక్యుమెంట్లు కాల్చేశారంటూ తప్పుడు ప్రచారం.. ఏపీ సీఐడీ సీరియస్

సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి పేరుతో ఈ ఖండన ప్రకటన విడుదలైంది. డాక్యుమెంట్లు కాల్చేశారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొన్ని ఛానెళ్లలో బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

హెరిటేజ్ డాక్యుమెంట్లు కాల్చేశారంటూ తప్పుడు ప్రచారం.. ఏపీ సీఐడీ సీరియస్
X

తాడేపల్లిలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్‌) కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశంటూ ఈరోజు ఉదయం నుంచి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి హెరిటేజ్ సంస్థకు చెందిన కీలక పత్రాలంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా కూడా రెచ్చిపోతోంది. జగన్ మెప్పుకోసం చంద్రబాబుపై సిట్ అనేక అక్రమ కేసులు పెట్టిందని.. ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు తగలబెడుతున్నారని కథనాలిచ్చింది. అయితే ఈ కథనాలపై సీఐడీ కూడా అంతే వేగంగా స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలంటూ ఓ ఖండన ప్రకటన విడుదల చేసింది.





సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి పేరుతో ఈ ఖండన ప్రకటన విడుదలైంది. డాక్యుమెంట్లు కాల్చేశారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొన్ని ఛానెళ్లలో బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో తాము ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని, ప్రతి ఛార్జ్ షీట్‌కు 8 వేల నుండి 10 వేల పేజీలున్న కాపీలు రూపొందించామని తెలిపారు. ఆ ఛార్జ్ షీట్ కాపీలను నిందితులకు అందించామని కూడా వివరించారు.

ఇక హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కోర్టుకి అందజేశామని, ఆ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కూడా కోర్టుకి అందజేశామని తెలిపారు. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించామన్నారు. పారదర్శకంగా తాము పనిచేస్తుంటే.. డాక్యుమెంట్లు కాల్చేశారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారాయన.

ఛార్జ్ షీట్ లు తయారు చేసే క్రమంలో తాము లక్షలాది పేపర్లు ప్రింట్ చేస్తుంటామని, ఆ సమయంలో కొన్ని సరిగా ప్రింట్ కావని పేర్కొన్నారు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి. ప్రింట్ సరిగా లేని పేపర్లను, వృథాగా ఉన్న వాటిని కాల్చి వేయడం సిబ్బంది విధి అని అన్నారు. అలాంటి ప్రక్రియను కూడా వక్రీకరించి వార్తలు రాయడం సరికాదని చెప్పారు.

First Published:  8 April 2024 9:23 AM GMT
Next Story