Telugu Global
Andhra Pradesh

రాయుడు పొలిటికల్ రీఎంట్రీ.. ట్వీట్ మర్మమేంటి..?

మరోసారి అంబటి రాయుడు పేరు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన చేసిన ట్వీట్‌తో మళ్లీ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారంటూ ప్రచారం మొదలైంది.

రాయుడు పొలిటికల్ రీఎంట్రీ.. ట్వీట్ మర్మమేంటి..?
X

క్రికెటర్ అంబటిరాయుడు మళ్లీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారా..? అవును ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. అంబటి రాయుడు చేసిన తాజా ట్వీట్‌ ఈ చర్చకు దారి తీసింది. ముందు వైసీపీలో చేరిన రాయుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. తర్వాత పవన్‌కల్యాణ్‌తో భేటీ కావడంతో జనసేనలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఏపీ రాజకీయాల్లో అంబటి రాయుడు పేరు పెద్దగా వినిపించలేదు.


ఇప్పుడు మరోసారి అంబటి రాయుడు పేరు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన చేసిన ట్వీట్‌తో మళ్లీ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారంటూ ప్రచారం మొదలైంది. ఇవాళ తెల్లవారుజామున సిద్ధం అంటూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు అంబటి రాయుడు. యాధృచ్ఛికంగా ఇవాల్టి నుంచి వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దీంతో అంబటి రాయుడు వైసీపీకి మద్దతుగానే ట్వీట్ చేశారంటూ చర్చ మొదలైంది.

గతేడాది డిసెంబర్‌లో సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు అంబటి రాయుడు. రాయుడుకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే తన బిజీ షెడ్యూల్ కారణంగా రాజకీయాలకు టైమ్‌ ఇవ్వలేకపోతున్నానంటూ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తర్వాత కొన్ని రోజులకే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలవడంతో ఆయన ఆ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ రాయుడు జనసేనలో చేరలేదు. ఇక తాజాగా చేసిన ట్వీట్‌ ఉద్దేశం ఏంటనేది అంబటి రాయుడు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

First Published:  27 March 2024 5:38 AM GMT
Next Story