Telugu Global
Andhra Pradesh

రజినీ వ్యాఖ్యల్లో తప్పేమీలేదు.. సుమన్ కామెంట్స్ వైరల్

రజినీకాంత్ తన ప్రసంగంలో ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదని సుమన్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ గురించి ప్రస్తావన తీసుకురాలేదన్నారు.

రజినీ వ్యాఖ్యల్లో తప్పేమీలేదు.. సుమన్ కామెంట్స్ వైరల్
X

ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబును పొగడటంపై అధికార పార్టీ వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు వెంట నడిచిన వ్యక్తి రజినీ అని తీవ్రస్థాయిలో మంత్రులు విమర్శించారు. రజినీపై వైసీపీ మంత్రులు చేసిన విమర్శలు తీవ్ర దుమారం సృష్టించాయి. రజినీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినీకాంత్ ప్రసంగంలో తప్పేమీ కనిపించలేదని ప్రముఖ సినీ నటుడు సుమన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కు కొత్త రూపం తీసుకురావడంలో చంద్రబాబు కృషి ఉందన్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో ఇప్పుడు ఎంతోమంది ఆ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఆయన హయాంలోనే శంషాబాద్ విమానాశ్రయం వచ్చిందని చెప్పారు.

రజినీకాంత్ తన ప్రసంగంలో ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదని సుమన్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ గురించి ప్రస్తావన తీసుకురాలేదన్నారు. అటువంటప్పుడు ఆయనపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. రజినీకాంత్ ఎప్పుడు నిజాలే మాట్లాడతారని, ఆయన మాటలు సరైనవే.. అని కొద్దిరోజుల కిందట జగపతిబాబు వ్యాఖ్యానించగా.. ఇప్పుడు రజినీకి మద్దతుగా సుమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First Published:  10 May 2023 3:40 AM GMT
Next Story