Telugu Global
National

ములాయం సింగ్ భార్య సాధనా గుప్తా కన్నుమూత

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కన్నుమూశారు. ఆమె గ‌త మూడు నెల‌లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్‌, ఇత‌ర త‌అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధి ముదరడంతో సాధనా గుప్తాను నాలుగు రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. ఆమె గురుగ్రామ్ లోని వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తొలుత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడగా, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. […]

ములాయం సింగ్ భార్య సాధనా గుప్తా కన్నుమూత
X

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కన్నుమూశారు. ఆమె గ‌త మూడు నెల‌లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్‌, ఇత‌ర త‌అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధి ముదరడంతో సాధనా గుప్తాను నాలుగు రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. ఆమె గురుగ్రామ్ లోని వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తొలుత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడగా, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. దాంతో ఆమెను ఐసీయూకి తరలించారు.

సాధనా గుప్తా ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య‌. మొద‌టి భార్య మాలతి దేవి (అఖిలేశ్ యాదవ్ తల్లి) 2003లో కన్నుమూశారు. ములాయంకు, సాధనా గుప్తాకు మధ్య 20 ఏళ్ల అంతరం ఉంది. సాధనా గుప్తాకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నారు. సాధనా గుప్తా కోడలు అపర్ణా యాదవ్ బీజేపీ నేత.

ములాయం సింగ్ యాదవ్ తన భార్య మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్నారని, మృతదేహాన్ని లక్నోకు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్ యాదవ్ అంత్యక్రియలకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాధన గుప్తా మరణవార్త తెలియగానే పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ములాయం ఇంటికి చేరుకోవడం ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఒక ట్వీట్‌లో ములాయం సింగ్ యాదవ్. అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

First Published:  9 July 2022 6:17 PM GMT
Next Story