Telugu Global
National

అమర్‌నాథ్‌లో ఆకస్మిక వరదలు.. 14మంది యాత్రికులు మృతి, పలువురు గల్లంతు

అమ‌ర‌నాథ్ యాత్ర‌లో విషాదం చోటు చేసుకుంది. అక‌స్మాత్తుగా వరదలు వెల్లువెత్తుతుండ‌డంతో 14 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికి పైగా యాత్రికులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. వరదల ధాటికి అమర్‌నాథ్‌ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో 40 మంది […]

అమర్‌నాథ్‌లో ఆకస్మిక వరదలు.. 14మంది యాత్రికులు మృతి, పలువురు గల్లంతు
X

అమ‌ర‌నాథ్ యాత్ర‌లో విషాదం చోటు చేసుకుంది. అక‌స్మాత్తుగా వరదలు వెల్లువెత్తుతుండ‌డంతో 14 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికి పైగా యాత్రికులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. వరదల ధాటికి అమర్‌నాథ్‌ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు.

ఇప్పటి వరకు 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో 40 మంది ఆచూకీ తెలియాల్సిఉందని సమాచారం. వారి కోసం గాలిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. మిగతావారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

అమర్‌నాథ్‌ పరిసరాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. దీంతో సహాయకచర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. వరదల దృష్ట్యా అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ వివిధ ఏజెన్సీల ద్వారా రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని, గాయపడిన వారిని చికిత్స కోసం విమానంలో తరలిస్తున్నామని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కుర‌వ‌డంతో గుహ ఎగువన నీరు చేరిందని అధికారులు తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ర‌హ‌దారిపై రాక‌పోక‌లు మూసివేసి వాటిని తొల‌గిస్తున్నారు. దీనివ‌ల్ల కాశ్మీర్ లోయలోని రెండు బేస్ క్యాంపులకు యాత్రికుల ప్రయాణాన్ని ప్రభావితం చేసింది.

అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకోవాలంటే శ్రీనగర్‌కు దాదాపు 90కి.మీ దూరంలో పహల్గామ్‌తోపాటు బాల్తాల్‌ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. ఆయా మార్గాల్లోని బేస్‌ క్యాంపుల నుంచి బ్యాచ్‌ల వారీగా పంపిస్తారు. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు నిలిపివేసిన యాత్ర జూన్ 30న తిరిగి ప్రారంభించారు.అయితే ప్రతికూల వాతావరణం కారణంగా గత మంగళవారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో యాత్రను మళ్లీ పునరుద్ధరించారు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు

First Published:  8 July 2022 8:31 PM GMT
Next Story