Telugu Global
NEWS

జూబ్లీహిల్స్ పబ్ రేప్ ఘటనపై గవర్నర్ సీరియస్

జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌కు వెళ్లిన బాలిక (17)పై జరిగిన సామూహిక లైంగిక దాడిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సీరియస్ అయ్యారు. బాలికపై జరిగిన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి సంబంధించిన మీడియా కథనాలను తాను పరిశీలిస్తున్నానని చెప్పారు. రెండు రోజుల్లోగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. రేప్ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్లు […]

governor-serious-on-jubileehills-pub-rape-incident/
X

జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌కు వెళ్లిన బాలిక (17)పై జరిగిన సామూహిక లైంగిక దాడిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సీరియస్ అయ్యారు. బాలికపై జరిగిన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి సంబంధించిన మీడియా కథనాలను తాను పరిశీలిస్తున్నానని చెప్పారు. రెండు రోజుల్లోగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి ఆమె ఆదేశాలు జారీ చేశారు.

రేప్ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్లు ఏ కుటుంబానికి చెందిన వారైనా వదిలి పెట్టవద్దని సూచించారు. బాధితురాలికి తగిన రక్షణ కల్పించాలని చెప్పినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధకరమని గవర్నర్ అన్నారు. మహిళా సంఘాలు కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు బాధితురాలి ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మండిపడుతున్నాయి. మైనర్ బాధితురాలి వివరాలను ఎలా బయటపెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసు అధికారులు కూడా రఘునందన్‌కు ఈ వీడియోలు ఎలా చేరాయనే విషయంపై ఆరా తీస్తున్నాయి.

కాగా, మే 28న పబ్‌కు వెళ్లిన ఓ బాలికను పరిచయం చేసుకొని.. అనంతరం కారులో తీసుకెళ్లి కొంత మంది యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

First Published:  5 Jun 2022 3:28 AM GMT
Next Story