Telugu Global
NEWS

తొలిరోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీ..

నాలుగురోజుల యూకే పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. తొలిరోజు బిజీ బిజీగా గడిపారు. యూకేలోని ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధి బృందాలతో సమావేశమైన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య అవకాశాలను వారికి వివరించారు. తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న ఆయన.. తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి సంస్థలకు కంపెనీలకు […]

KTR
X

నాలుగురోజుల యూకే పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. తొలిరోజు బిజీ బిజీగా గడిపారు. యూకేలోని ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధి బృందాలతో సమావేశమైన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య అవకాశాలను వారికి వివరించారు.

తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న ఆయన.. తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి సంస్థలకు కంపెనీలకు పరిచయం చేస్తున్నారు. టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకువచ్చిన పాలసీలను వారికి వివరించారు. కొత్త పాలసీల ద్వారా ఇప్పటిదాకా తెలంగాణకు వచ్చిన భారీ కంపెనీల వివరాలను అక్కడి ప్రతినిధులకు తెలియచేశారు. తెలంగాణ రాష్ట్రం వినూత్నమైన పారిశ్రామిక పాలసీని రూపొందించని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవ వనరులు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయని వివరించారు.

కంపెనీలకు సాదర ఆహ్వానం..
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్. దేశంలోని ఇతర నగరాల్లో లేని అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్ లో మాత్రమే ఉందన్నారు. భారత్ లో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్ అనేకసార్లు అవార్డులందుకున్న విషయాన్ని వారికి తెలియజేశారు. హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు లైఫ్ సైన్సెస్- ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు ప్రధాన హబ్ గా మారిందని తెలిపారు. పలు మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా తర్వాత వారి అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటుచేశాయన్న సంగతిని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇండియా, ఇంగ్లండ్ మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దన్న కేటీఆర్, తమ రాష్ట్రంలోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.
డెలాయిట్, హెచ్ఎస్బీసీ, జేసీబీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ తోపాటు.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

ALSO READ: ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ పురోగమిస్తున్న ‘దళిత బంధు’

First Published:  18 May 2022 9:21 AM GMT
Next Story