Telugu Global
NEWS

కుప్పం చేజారిపోతుందనే ప్రస్టేషన్ లో బాబు.. రోజా పంచ్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నగరి ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడ కుప్పం సీటు చేజారి పోతుందోనన్న ప్రస్టేషన్ లో చంద్రబాబు ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనపై రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు తీవ్ర ప్రస్టేషన్ లో ఉన్నారంటూ ధ్వజమెత్తారు. కుప్పం ప్రజలకు ఆయన చేసిందేమిలేదన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ మండిపడ్డారు. హంద్రీ నీవా […]

కుప్పం చేజారిపోతుందనే ప్రస్టేషన్ లో బాబు.. రోజా పంచ్
X

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నగరి ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడ కుప్పం సీటు చేజారి పోతుందోనన్న ప్రస్టేషన్ లో చంద్రబాబు ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనపై రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు తీవ్ర ప్రస్టేషన్ లో ఉన్నారంటూ ధ్వజమెత్తారు.

కుప్పం ప్రజలకు ఆయన చేసిందేమిలేదన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ మండిపడ్డారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడని రోజా ధ్వజమెత్తారు.

కుప్పంలో కనీసం చంద్రబాబుకు ఇల్లు లేదని, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటేయాలని అడిగేందుకు కుప్పం వచ్చారని విమర్శించారు.

గత వారం అంతా చంద్రబాబు పట్టాభితో బూతు డ్రామా నడిపించారని.. తాజాగా కుప్పంలో బాంబు డ్రామా ఆడించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రోజా మండిపడ్డారు. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా ప్రజలు వైసీపీకే పట్టంకడతారని ధీమా వ్యక్తం చేశారు. క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేయడం మాని.. నేరుగా సీఎం జగన్‌ను ఢీ కొట్టాలని రోజా సవాల్ విసిరారు.

First Published:  30 Oct 2021 9:37 AM GMT
Next Story