Telugu Global
NEWS

చెప్పులేసినా స్పందించని ఆమె ఇప్పుడు గాజులిస్తే నమ్ముతారా?

రాజధాని ప్రాంతంలో తన బినామీలు, తాను కొనుగోలు చేసిన భూముల విలువ పడిపోతోందన్న ఆందోళనతోనే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రాజధాని ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న వారు నిజమైన రైతులు కాదని ఆమె వ్యాఖ్యానించారు. రైతుల నుంచి భూములు లాక్కున్న చంద్రబాబుకు రైతులు మద్దతు ప్రకటించే అవకాశమే లేదన్నారు. తండ్రి ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు బయటకు రాని, అసెంబ్లీలో ఎన్టీఆర్‌ ఏడుస్తూ బయటకు వచ్చినా కనీసం పరామర్శకు వెళ్లని భువనేశ్వరి…. దగ్గుపాటి […]

చెప్పులేసినా స్పందించని ఆమె ఇప్పుడు గాజులిస్తే నమ్ముతారా?
X

రాజధాని ప్రాంతంలో తన బినామీలు, తాను కొనుగోలు చేసిన భూముల విలువ పడిపోతోందన్న ఆందోళనతోనే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రాజధాని ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న వారు నిజమైన రైతులు కాదని ఆమె వ్యాఖ్యానించారు. రైతుల నుంచి భూములు లాక్కున్న చంద్రబాబుకు రైతులు మద్దతు ప్రకటించే అవకాశమే లేదన్నారు.

తండ్రి ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు బయటకు రాని, అసెంబ్లీలో ఎన్టీఆర్‌ ఏడుస్తూ బయటకు వచ్చినా కనీసం పరామర్శకు వెళ్లని భువనేశ్వరి…. దగ్గుపాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణలను చంద్రబాబు పార్టీ నుంచి గెంటేసినా పట్టించుకోని భువనేశ్వరి… ఇప్పుడు మాత్రం రాజధాని ప్రాంతానికి వచ్చి గాజులు ఇస్తే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. కేవలం రాజధాని ప్రాంతంలోని హెరిటేజ్ భూముల ధరలు పడిపోతాయనే నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

రాజధాని కోసమంటూ స్కూల్ పిల్లల నుంచి కూడా 10 రూపాయలు వసూలు చేసిన చంద్రబాబు… మరి సొంత కుటుంబసభ్యుల నుంచి రాజధాని కోసం ఎందుకు విరాళాలు తీసుకోలేదని రోజా ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ భూముల కోసం తపిస్తున్న చంద్రబాబు… దాన్ని రాజధానిపై ప్రేమగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

First Published:  6 Jan 2020 2:00 AM GMT
Next Story