Telugu Global
Cinema & Entertainment

ప్రస్తుతం వీళ్లిద్దరే బిజీ

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కొనసాగుతున్నారు. అనుష్క, సమంత తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోకపోయినా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అందర్లో ఇద్దరు మాత్రం యమ బిజీగా దూసుకుపోతున్నారు. వాళ్లే రాశిఖన్నా, పూజా హెగ్డే. అవును.. ప్రస్తుతం అవకాశాల వేటలో వీళ్లిద్దరిదే హవా. రాశిఖన్నా చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. సాయిధరమ్ తేజ్ సరసన ప్రతిరోజూ పండగే అనే సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. అటు విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ […]

ప్రస్తుతం వీళ్లిద్దరే బిజీ
X

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కొనసాగుతున్నారు. అనుష్క, సమంత తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోకపోయినా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అందర్లో ఇద్దరు మాత్రం యమ బిజీగా దూసుకుపోతున్నారు. వాళ్లే రాశిఖన్నా, పూజా హెగ్డే. అవును.. ప్రస్తుతం అవకాశాల వేటలో వీళ్లిద్దరిదే హవా.

రాశిఖన్నా చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. సాయిధరమ్ తేజ్ సరసన ప్రతిరోజూ పండగే అనే సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. అటు విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు నాగచైతన్య సరసన వెంకీమామ మూవీలో నటిస్తోంది. ఈ 3 సినిమాల తర్వాత 2 తమిళ సినిమాలకు కమిట్ అయింది ఈ బ్యూటీ.

అటు పూజా హెగ్డే కూడా ఇంతే స్పీడ్ గా దూసుకుపోతోంది. గద్దలకొండ గణేష్ ను థియేటర్లలోకి తీసుకొచ్చిన పూజా హెగ్డే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అఖిల్ కొత్త సినిమా సెట్స్ పైకి వాలిపోయింది. దీనికంటే ముందే ఆమె, బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ సరసన రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ అనే సినిమా కూడా చేస్తోంది. ఇది కూడా పారిస్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.

ఇలా ప్రస్తుతానికి రాశిఖన్నా, పూజా హెగ్డే మాత్రమే మూడేసి సినిమాలతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అనుష్క, సమంత లాంటి హీరోయిన్లు కొన్ని కథలకే పరిమితం అవ్వడం.. తమన్న, రెజీనా లాంటి భామలు ఓల్డ్ అయిపోవడంతో వీళ్ల హవా సాగుతోంది.

First Published:  25 Sep 2019 9:03 PM GMT
Next Story