Telugu Global
NEWS

కరకట్ట కట్టడాల్ని కూల్చాల్సిందే...

కృష్ణా నది కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందేనని బీజేపీ నేతలు విష్ణువర్థన్‌ రెడ్డి, రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు బీజేపీ సహకారం ఉంటుందని రావెల చెప్పారు. నదులను, పర్యావరణాన్ని దెబ్బతీసే ఏ కట్టడాన్ని అయినా సరే కూల్చివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నదీ గర్భంలో నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. కరకట్ట అక్రమ భవనాన్ని చంద్రబాబు తక్షణం ఖాళీ చేయాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు […]

కరకట్ట కట్టడాల్ని కూల్చాల్సిందే...
X

కృష్ణా నది కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందేనని బీజేపీ నేతలు విష్ణువర్థన్‌ రెడ్డి, రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు బీజేపీ సహకారం ఉంటుందని రావెల చెప్పారు.

నదులను, పర్యావరణాన్ని దెబ్బతీసే ఏ కట్టడాన్ని అయినా సరే కూల్చివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నదీ గర్భంలో నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు.

కరకట్ట అక్రమ భవనాన్ని చంద్రబాబు తక్షణం ఖాళీ చేయాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం ముమ్మాటికీ అక్రమమేనన్నారు.

చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగు దొంగల పార్టీగా మారిపోయిందన్నారు. త్వరలోనే చంద్రబాబు, ఆయన కుమారుడు, ఇతర టీడీపీ నేతలు తీహార్ జైలుకు వెళ్లక తప్పదని… కాబట్టి టీడీపీ నేతలంతా హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు.

రావెల, విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి ఏపీ బీజేపీ చంద్రబాబు పట్ల రెండుగా చీలినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సుజనాచౌదరి, సీఎం రమేష్ ఆధ్వర్యంలో కొత్త కమలనాథులు చంద్రబాబును ఇప్పటికీ బహిరంగంగా సమర్ధిస్తున్నారు.

అయితే తొలి నుంచి బీజేపీలోనే ఉన్న అసలైన కమలనాథులు మాత్రం చంద్రబాబుపై ఇప్పటికీ మండిపడుతూనే ఉన్నారు. దాంతో చంద్రబాబు ప్రభావం బీజేపీలోని నేతల అనైక్యతను స్పష్టంగా చూపిస్తోంది.

First Published:  23 Sep 2019 5:47 AM GMT
Next Story