Telugu Global
NEWS

పరిటాల సునీతకు సీమ కంటే అమరావతే ఎక్కువైందా?

హైదరాబాద్‌ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధిని అందిచేలా నాలుగు కేంద్రాల్లో రాజధాని తరహా అభివృద్ధి చేసేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్న వార్తల నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయలసీమ ప్రాంతానికే చెందిన టీడీపీ భావజాలమున్న కొందరు మేధావులు, కొందరు టీడీపీ నేతలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ నేతల్లోనూ చాలా మంది అభివృద్ది అన్ని […]

పరిటాల సునీతకు సీమ కంటే అమరావతే ఎక్కువైందా?
X

హైదరాబాద్‌ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధిని అందిచేలా నాలుగు కేంద్రాల్లో రాజధాని తరహా అభివృద్ధి చేసేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్న వార్తల నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాయలసీమ ప్రాంతానికే చెందిన టీడీపీ భావజాలమున్న కొందరు మేధావులు, కొందరు టీడీపీ నేతలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు.

టీడీపీ నేతల్లోనూ చాలా మంది అభివృద్ది అన్ని ప్రాంతాలకు విస్తరించడం మంచిదే అని అంతర్గతంగా సంతోషిస్తున్నా… ఒక వర్గానికి చెందిన సీమ నేతలు మాత్రం అమరావతిలోనే అన్ని పెట్టాలంటున్నారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధికి తాము వ్యతిరేకం అని స్వయంగా బయటకు చెప్పలేక.. దొనకొండ పేరుతో అమరావతి రాగం ఆలపిస్తున్నారు.

ఈ విషయంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.

అమరావతి జోలికి వస్తే తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని.. స్వయంగా రాయలసీమ గడ్డ మీద నుంచే ఆమె హెచ్చరిక జారీ చేశారు.

అనంతపురం జిల్లా మడకశిరలో ఆమె ఈ ప్రకటన చేశారు. రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన రాయలసీమ గురించి ఆలోచించకుండా… అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తానని పరిటాల సునీత ప్రకటించడం ద్వారా తమ మూలాలను ఆమె మరిచిపోలేకపోతున్నారని కొందరు విమర్శిస్తున్నారు.

అనంతపురం జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్‌ను చంద్రబాబు గుంటూరు జిల్లాకు తరలించుకుపోయినప్పుడు ఇదే తరహాలో పరిటాల సునీత మాట్లాడి ఉంటే ఆమెకు గౌరవం ఉండేదని… అప్పుడు అనంతపురం జిల్లాకు ద్రోహం జరుగుతున్నా చప్పట్లు కొట్టి…. ఇప్పుడు మాత్రం అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తాననడం బట్టి ఆమెకు సీమపై కంటే అమరావతిపై ప్రేమ ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోందని సీమ వాసులు మండిపడుతున్నారు.

అమరావతి కోసం ప్రాణత్యాగానికి సిద్ధమంటున్న పరిటాల సునీత వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్, గల్లా జయదేవ్ తరహాలోనే సీమను వదిలేసి వెళ్లి అమరావతి ప్రాంతంలో పోటీ చేయాలని కొందరు సలహా ఇస్తున్నారు.

First Published:  27 Aug 2019 12:51 AM GMT
Next Story